Revanth Reddy: దళిత, గిరిజన హక్కుల కోసం పోరాడుతాం

* ఆగస్టు 9 నుంచి ఇంద్రవెల్లి నుంచి సమరశంఖం * టీఆర్ఎస్‌ ఎమ్మెల్యేల ఇళ్ల ముందు చావు డప్పు కొడతామని హెచ్చరిక

Update: 2021-08-01 01:34 GMT

రేవంత్‌రెడ్డి (ఫైల్ ఫోటో)

Revanth Reddy: దళిత, గిరిజన హక్కుల కోసం ఆగష్టు 9న ఆదిలాబాద్‌ జిల్లా ఇంద్రవెల్లి నుంచి సమరశంఖం పూరించనున్నట్లు పీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి వెల్లడించారు. దళిత బంధు అమలు చేయకపోతే టీఆర్ఎస్‌ ఎమ్మెల్యేల ఇళ్ల ముందు చావు డప్పు కొడతామని హెచ్చరించారు. కాంగ్రెస్ హయాంలో దళిత, గిరిజనులకు భూములు ఇస్తే కేసీఆర్ సర్కార్‌ ఆ భూములను లాక్కుంటుందని మండిపడ్డారు. సచివాలయం, ప్రగతిభవన్‌ అమ్మైనా దళితులందరికీ దళిత బంధు అందించలని రేవంత్‌రెడ్డి డిమాండ్ చేశారు. వచ్చే అసెంబ్లీలో దళిత బంధుపై ఏకగ్రీవ తీర్మానం చేయాలన్నారు.

Tags:    

Similar News