Flight Accident in Kerala: కేర‌ళ‌లో విమాన ప్రమాదం.. పైలెట్ మృతి

Flight Accident in Kerala: కేరళలో ఎయిర్ ఇండియా విమానానికి ప్రమాదం జరిగింది. దుబాయ్ నుంచి కోజికోడ్ వస్తున్న ఎయిర్ ఇండియా విమానం కారిపూర్ ఎయిర్‌పోర్ట్ వద్ద ప్రమాదానికి గురైంది

Update: 2020-08-07 15:57 GMT

Flight Accident in Kerala: కేరళలో ఎయిర్ ఇండియా విమానానికి ప్రమాదం జరిగింది. దుబాయ్ నుంచి కోజికోడ్ వస్తున్న ఎయిర్ ఇండియా విమానం కారిపూర్ ఎయిర్‌పోర్ట్ వద్ద ప్రమాదానికి గురైంది. ల్యాండింగ్ సమయంలో రన్‌వే నుంచి విమానం ప‌క్క‌కు జారింది. ఈ ప్ర‌మాదంలో విమానం రెండు ముక్క‌లైంది. ముందుభాగం పూర్తిగా దెబ్బ‌తిన్న‌ది. ఈ ప్ర‌మాదంలో పైలెట్ మ‌ర‌ణించిన‌ట్టు స‌మాచారం, ప‌లువురికి తీవ్ర‌గాయ‌ల‌య్యాయి. ప్రమాద సమయంలో మొత్తం 191 మంది విమానంలో ఉన్నారు. మిగితా వివ‌రాలు తెలియాల్సి ఉంది. కేరళలో భారీ ఎత్తున వర్షం పడుతోంది. దీని వల్ల ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. 

Tags:    

Similar News