ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి కనిపించడం లేదంటూ ఫిర్యాదు

Update: 2019-12-23 06:43 GMT
ఆళ్ల రామకృష్ణారెడ్డి

రాజధానిని అమరావతిలోనే కొనసాగించాలని డిమాండ్‌ చేస్తూ ఏపీలో ఆందోళనలు కొనసాగుతున్నాయి. కృష్ణాయపాలెంలో ఇవాళ వంటావార్పు కార్యక్రమం చేపట్టనున్నారు. తుళ్లూరులో మహాధర్నా, వెలగపూడిలో రీలే నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి. తుళ్లూరులో టెంట్‌లు తొలగించాలంటూ పోలీసులు ఆదేశాలు జారీ చేశారు. దీంతో రైతులు, పోలీసులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. రోడ్లపై పడుకొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు.

మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణ రెడ్డి కనిపించడం లేదని మంగళగిరి పోలీసు స్టేషన్‌లో నిడమర్రు రైతులు ఫిర్యాదు చేశారు. మూడు రాజధానులను వ్యతిరేకిస్తూ ఆందోళన జరుగుతున్న నాటి నుంచి ఎమ్మెల్యే ఆర్కే కనిపించట్లేదని రైతులు చెబుతున్నారు. ఈ క్రమంలో మంగళగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే ఆర్కే కనిపించట్లేదని ఆయన్ను వెతికిపెట్టాలని పోలీసులకు రైతులు, కూలీలు ఫిర్యాదు చేశారు. రాజధానిపై నెలకొన్న సందిగ్దతపై తమ గోడు వెళ్లబుచ్చుకుందామంటే తమ ఎమ్మెల్యే ఎక్కుడున్నారో తెలియట్లేదని ఎమ్మెల్యే కోసం తీవ్ర ఆందోళన చెందుతున్నామని ఫిర్యాదులో పేర్కొన్నారు.

 



 

Tags:    

Similar News