నేడు రాజమండ్రిలో వైసీపీ కాపు ప్రజాప్రతినిధుల సమావేశం

*హాజరుకానున్న మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు

Update: 2022-10-31 03:30 GMT

నేడు రాజమండ్రిలో వైసీపీ కాపు ప్రజాప్రతినిధుల సమావేశం

Andhra Pradesh: జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు కౌంటర్ ఇచ్చేలా వైసీపీలోని కాపు నాయకులు ప్రణాళికలు రచిస్తున్నారు. ఈ క్రమంలోనే వైసీపీలోని కాపు ప్రజాప్రతినిధులు ఇవాళ రాజమండ్రిలో సమావేశం కానున్నారు. ఈ సమావేశానికి వైసీపీలో కాపు సామాజిక వర్గానికి చెందిన మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు.. ఇతర ప్రజాప్రతినిధులు హాజరుకానున్నారు. వైసీపీలోని కాపుల నాయకులపై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై ఈ సమావేశంలో చర్చించనున్నట్లు తెలుస్తోంది. పవన్ కల్యాణ్ వ్యాఖ్యలకు గట్టి కౌంటర్ ఇచ్చేలా ఈ సమావేశంలో నిర్ణయాలు తీసుకోనున్నట్టుగా సమాచారం. 

Full View


Tags:    

Similar News