ఎస్ఈసీ నిమ్మగడ్డకు ఎమ్మెల్యే జోగి రమేష్‌ లేఖ

Update: 2021-02-12 10:42 GMT

ఏపీ ఎస్ఈసీ నిమ్మగడ్డకు వైసీపీ ఎమ్మెల్యే జోగి రమేష్ లేఖ రాశారు. ముందస్తు నోటీసు ఇవ్వకుండా చర్యలు తీసుకోవడం అన్యాయమన్నారు. ఎస్ఈసీ ఏకపక్షంగా నిర్ణయం తీసుకుంటున్నారని ఆరోపించారు. తనపై తీసుకున్న చర్యను ఉపసంహరించుకోవాలన్నారు ఎమ్మెల్యే జోగి రమేష్. ఈ నెల 17 వరకు మీడియాతో మాట్లాడొద్దని జోగి రమేష్‌కు ఎస్‌ఈసీ ఆదేశాలు జారీ చేసింది. వైసీపీ బలపరిచిన అభ్యర్థికి ఎదురుగా ఎవరు పోటీకి దిగినా.. వారికి ప్రభుత్వ పథకాలు కట్ చేస్తామని రమేష్ హెచ్చరించారు. పెడనలో జరిగిన ఈ సమావేశంలో ఎమ్మెల్యే ఈ వ్యాఖ్యలు చేశారు. దీనిపై మీడియాలో కథనాలు ప్రసారమయ్యాయి. వీడియో ఆధారాలు ఉండడంతో ఎస్ఈసీ ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది.

Tags:    

Similar News