వైసీపీకి వ్యతిరేకంగా నామినేషన్‌ వేస్తే ప్రభుత్వ పథకాలు కట్ : ఎమ్మెల్యే జోగి రమేష్‌

Update: 2021-02-11 14:46 GMT

కృష్ణా జిల్లా పెడన ఎమ్మెల్యే జోగి రమేష్‌ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పంచాయతీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన వైసీపీకి వ్యతిరేకంగా నామినేషన్‌ వేస్తే ప్రభుత్వ పథకాలు కట్‌ చేస్తామన్నారు. వార్డు మెంబర్‌గా పోటీ చేసినా.. ప్రభుత్వ పథకాలు అందకుండా చేస్తామన్నారు. సీఎం జగన్‌ ఇస్తున్న పథకాలు తీసుకుంటూ వ్యతిరేకంగా ఎలా నిలబడతారంటూ ప్రశ్నిస్తున్నారు. పార్టీకి వ్యతిరేకంగా నామినేషన్‌ వేస్తే... పెన్షన్‌, కాపు నేస్తం, అమ్మఒడి పథకాలు కట్‌ చేసి పారేస్తాం అంటున్నారు.

Tags:    

Similar News