మాజీ సీఎం చంద్రబాబు ఇంటిమీదకు డ్రోన్లు వదలడంపై ట్వీట్ చేసిన వర్మ

Update: 2019-08-17 06:40 GMT

మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఇంటిమీదకు డ్రోన్లను వదలడంపై స్పందించారు సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ. ఈ మేరకు తన ట్విటర్ లో ట్వీట్ చేశారు.'తన ఇంటిపై డ్రోన్లు ఎగురుతున్నందుకు సీబీఎన్(చంద్రబాబు) ఎందుకు ఆందోళన చెందుతున్నాడు? ఆయనేమైనా ఒసామా బిన్ లాడిన్ లాంటివాడా? లేదా తన పెరట్లో ఏదైనా దాచుకున్నాడా? ఊరకనే అడుగుతున్నా' అంటూ ట్వీట్ చేశాడు వర్మ. కాగా శుక్రవారం చంద్రబాబునాయుడు ఇల్లు పరిసర ప్రాంతాలపై వరద తీవ్రతను అంచనా వేసేందుకు ఇరిగేషన్ శాఖా అధికారులు డ్రోన్లు వదిలిన సంగతి తెలిసిందే. దీంతో టీడీపీ నేతలు చంద్రబాబు భద్రతపై ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం కుట్ర పూర్వకంగానే చంద్రబాబు ఇంటిమీదకు వరద వదిలారని ఆ పార్టీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. ఇదిలావుంటే వరద ఉదృతి నేపథ్యంలో శనివారం గుంటూరు, కృష్ణా జిల్లాల్లో హైఅలర్ట్ ప్రకటించింది ఏపీ ప్రభుత్వం.

Tags:    

Similar News