ఏపీ తెలంగాణలో భారీ వర్షాలు.. పిడుగులు

బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతుండడం వల్ల వచ్చే మూడు రోజుల ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆంధ్ర ప్రదేశ్‌ వాతావరణ శాఖ వెల్లడించింది.

Update: 2020-05-04 03:49 GMT

బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతుండడం వల్ల వచ్చే మూడు రోజుల ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆంధ్ర ప్రదేశ్‌ వాతావరణ శాఖ వెల్లడించింది.దక్షిణ అండమాన్ సముద్రం, దాన్ని ఆనుకొని ఉన్న ఆగ్నేయ బంగాళాఖాతం ప్రాంతాల్లో అల్పపీడనం కొనసాగుతోందని తెలిపింది. ఇది మరింత బలపడి సుమారుగా మే 7 వ తేదీన ఆగ్నేయబంగాళాఖాతం, దాని పరిసర ప్రాంతాల్లో తీవ్ర అల్పపీడనంగా మారే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది.

కాగా..ఇది మే 7 వ తేదీ వరకు వాయువ్య దిశగా ప్రయాణించే అవకాశం ఉంది. దక్షిణ విదర్భ నుంచి దక్షిణ తమిళనాడు వరకు తెలంగాణ, రాయలసీమ మీదుగా 0.9 కిలోమీటర్ల ఎత్తు వరకు ఉపరితల ద్రోణి కొనసాగుతోంది. ట్రోపోస్పీయర్ స్థాయిల ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. తదుపరి 48 గంటల్లో అదే ప్రాంతంలో వాయుగుండముగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది.

దక్షిణ అండమాన్ సముద్రం, దాన్ని ఆనుకొని ఉన్న ఆగ్నేయ బంగాళాఖాతం ప్రాంతాల్లో అల్పపీడనం కొనసాగుతోందని తెలిపింది. సోమ, మంగళవారాల్లో ఉరుములు, మెరుపులు, వడగండ్లు, ఈదురు గాలులతో పాటు వర్షాలు కురిసే అవకాశం ఉంది. తీర ప్రాంతాల్లో మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. రాయలసీమలో గరిష్ఠ ఉష్ణోగ్రత 43 డిగ్రీల వరకు నమోదవుతుందని వాతావరణ శాఖ తెలిపింది.

Tags:    

Similar News