వైఎస్ వివేకా హత్య కేసులో అనుమానితుడు శ్రీనివాసులురెడ్డి ఆత్మహత్య చేసుకున్నాడు. హత్య కేసులో తనను పోలీసులు వేధిస్తున్నారని సూసైడ్ నోట్ రాశాడు. పులివెందుల సీఐ శ్రీరాములు తీవ్ర వేధింపులు భరించలేకే ఈ ఘటనకు పాల్పడినట్టు నోట్లో వెల్లడించాడు. శ్రీనివాసులురెడ్డి ఆత్మహత్య యత్నం చేయగా కడపలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు అయితే చికిత్స పొందుతూ శ్రీనివాసులురెడ్డి మృతి చెందాడు. అలాగే సీఎం వైఎస్ జగన్, వైఎస్ భాస్కరరెడ్డికి కూడా శ్రీనివాసులురెడ్డి లేఖ రాశాడు. సూసైడ్ నోట్ను కుటుంబ సభ్యులకు డాక్టర్లు అందజేశారు. శ్రీనివాసులు రెడ్డిది కడప జిల్లా సింహాద్రిపురం. వైఎస్ వివేకా హత్య కేసులో నిందితుడు పరమేశ్వరరెడ్డికి శ్రీనివాసులు రెడ్డి సమీప బంధువు.