తిరుపతిలో నేడు చంద్రబాబు, పవన్కల్యాణ్ ఎన్నికల ప్రచారం
Tirupati: మధ్యాహ్నం 3 గం.కు తిరుపతికి చేరుకోనున్న చంద్రబాబు
Tirupati: తిరుపతి జిల్లాలో నేడు చంద్రబాబు, పవన్కల్యాణ్ ఉమ్మడి ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు ఆయన తిరుపతి ఎయిర్పోర్టుకు చేరుకుంటారు. హెలికాప్టర్లో అక్కడికి చేరుకుని చిత్తూరు జిల్లా పుంగనూరులో జరిగే ఎన్నికల ప్రచార సభలో పాల్గొంటారు. అనంతరం అక్కడి నుంచి బయల్దేరి సాయంత్రం 6 గంటల 10 నిమిషాలకు రేణిగుంట ఎయిర్పోర్టుకు తిరిగి చేరుకుంటారు. రోడ్డు మార్గం ద్వారా తిరుపతి చేరుకుని లీలా మహల్ కూడలి నుంచి దేవేంద్ర థియేటర్, మున్సిపల్ ఆఫీస్ మీదుగా జరిగే రోడ్షో పాల్గొంటారు. అక్కడ జరిగే సభలో పవన్కల్యాణ్, చంద్రబాబు కలిసి బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు.