Vijaysai Reddy: డ్రగ్స్పై టీడీపీ ఆరోపణలను ఖండించిన విజయసాయి రెడ్డి
Vijaysai Reddy: ట్వీట్ చేస్తే డ్రగ్స్ కేసును నాకు ఎలా ఆపాదిస్తారు
Vijaysai Reddy: విశాఖ పోర్టులో లభ్యమైన డ్రగ్స్పై రాజకీయ దుమారం కొనసాగుతూనే ఉంది. అధికార విపక్షాలు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటూనే ఉన్నాయి. తాజాగా టీడీపీ చేసిన ఆరోపణలపై విజయసాయి మండిపడ్డారు. బ్రెజిల్ అధ్యక్ష ఎన్నికల్లో గెలిచిన నేతను అభినందిస్తూ ట్వీట్ చేస్తే తప్పెలా అవుతోందన్నారు. ఉద్దేశపూర్వకంగానే తెలుగుదేశం నాయకులు తనపై నిందలు వేస్తున్నారని ఆక్షేపించారు. సంధ్య ఆక్వా కంపెనీతో టీడీపీ నేతలకే సంబంధాలున్నాయని విమర్శించారు.