YSRCP: సిద్ధం సభ పోస్టర్‌ను విడుదల చేసిన విజయసాయిరెడ్డి

YSRCP: ఈనెల 10న మేదరమెట్ల సమీపంలో సిద్ధం చివరి సభ

Update: 2024-03-02 13:03 GMT

YSRCP: సిద్ధం సభ పోస్టర్‌ను విడుదల చేసిన విజయసాయిరెడ్డి

YSRCP: ఈ నెల 10వ తేదీ ప్రకాశం, బాపట్ల జిల్లాల పరిధిలోని మేదరమెట్ల సమీపంలో వంద ఎకరాల్లో సిద్దం చివరి సభ నిర్వహిస్తున్నట్లు రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి తెలిపారు. ఒంగోలులో సిద్దం పోస్టర్ ను మంత్రులు,ఎమ్మెల్యే లు, నియోజక వర్గ ఇంచార్జిల సమక్షంలో ఆవిష్కరించారు. సిద్దం చివరి సభకు 15లక్షల మంది హాజరు అవుతారని విజయసాయిరెడ్డి తెలిపారు.

ఈ సభలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలతో పాటు వచ్చే ఐదేళ్ల కాలంలో చేపట్టే కార్యక్రమాలను ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి వివరిస్తారని తెలిపారు. ఇప్పటి వరకు జరిగిన సిద్దం సభలకు వచ్చిన ప్రజల ఆదరణ చూస్తుంటే వచ్చే ఎన్నికల్లో 175 స్థానాలు గెలుచుకుంటామనడంలో సందేహం లేదన్నారు. అలాగే 25 ఎంపీ స్థానాలను కూడా గెలుచుకుంటామని ధీమా వ్యక్తం చేశారు.

Tags:    

Similar News