పాకిస్ధాన్ జైళ్లలో మగ్గుతున్న భారతీయ జాలర్ల విడుదలకు తక్షణమే చొరవ చూపాలని వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. దేశవ్యాప్తంగా 483 మంది జాలర్లు కరాచీ జైళ్లలో మగ్గుతున్నట్టు ఆయన తెలియజేశారు. అయితే వారిని విడుదల కోసం మత్య్సకార కుటుంబాలు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్న ఫలితం ఉండటం లేదన్నారు. గతంలో ఈ విషయాన్ని నాటి విదేశాంగశాఖ మంత్రి సుష్మా స్వరాజ్కు కూడా తెలియజేశామన్నారు. ఈ విషయం తక్షణమే జోక్యం చేసుకోవాలన్నారు.