ఉండి: దేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తున నేపధ్యంలో లాక్ డౌన్ కారణంగా పెద్దపుల్లేరు గ్రామంలో 1000 కుటుంబలకు 10 రకాల కూరగాయలు పంపిణి చేసిన వేగిరెడ్డి రాము మన ఇంటి గడపే.. మన లక్ష్మణరేఖ ఎవరూ ఇళ్లలో నుంచి బయటకు రావద్దు. కోవిడ్ వ్యాధికి విరుగుడు స్వీయ నిర్బంధమే అని వేగిరెడ్డి రాము కొనియాడారు. ఈ రోజు పెద్దపులేరు గ్రామంలో కీర్తిశేషులు వేగిరెడ్డి సుబ్బారావు జ్ఞాపకార్ధం వారి యొక్క కుమారుడు వేగిరెడ్డి రాము ఆర్ధిక సహాయంతో రాము ఆధ్వర్యంలో సుమారుగా 1000 కుటుంబాలకు 10 రకాల కూరగాయలు పంపిణీ చేశారు.
కరోనా మహమ్మారి వల్ల వచ్చే కోవిడ్ వ్యాధికి మందే లేదని చెప్పారు. ఈ వ్యాధికి విరుగుడు మనం ఇంట్లో ఉండటమేనని తెలిపారు. ఈ కార్యక్రమంలో వేగిరెడ్డి చినబాబు, గేదెల నరసింహులు, పాటురి దొరబాబు, పెద్దింటి చిన్న నాగేశ్వరరావు, రాయి శ్రీనివాస్, పెద్దింటి నాగేశ్వరరావు, పాటురి సుబ్రహ్మణ్యం, యువకులు మడక సురేష్, మతల రాము, పెద్దింటి రమేష్, వేగిరెడ్డి కుమార్, బొనాం పుల్లయ్య బాబు, పెద్దింటి హరి, పెద్దింటి పవన్, మధుర నవీన్, కాజా నాగరాజు తదితరులు పాల్గొన్నారు.