ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ గా ఈ నెల 8న వాసిరెడ్డి పద్మను రాష్ట్ర ప్రభుత్వం నియమించిన విషయం తెలిసిందే. వాసిరెడ్డి పద్మ సోమవారం ప్రమాణ స్వీకారం చేశారు. అమరావతిలో జరిగిన ఈ కార్యక్రమానికి స్పీకర్ తమ్మినేని సీతారాం, డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి, నారాయణ స్వామి, మంత్రులు ధర్మాన కృష్ణదాస్, జయరాములు, తానేటి వనిత, చెరుకువాడ శ్రీరంగనాథ్ రాజు, ఏపీఐఐసీ చైర్మన్ ఆర్కే రోజా, ఎంపీలు వంగా గీత, చింత అనురాధ, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు.. సజ్జల రామకృష్ణారెడ్డి, జీవీడీ కృష్ణమోహన్, వైసీపీ జాతీయ అధికార ప్రతినిధి కనుమూరు రవిచంద్రారెడ్డి తదితరులు హాజరయ్యారు. ఈ సందర్బంగా బాధ్యతలు స్వీకరించిన వాసిరెడ్డి పద్మకు అభినందనలు తెలిపారు.