Rajnath Singh: నేడు ఏపీలో పర్యటించనున్న కేంద్రమంత్రి రాజ్నాథ్
Rajnath Singh: ఢిల్లీ నుంచి విజయవాడకు చేరుకుని రాష్ట్ర బీజేపీ నాయకులతో భేటీ
Rajnath Singh: నేడు ఏపీలో కేంద్రమంత్రి రాజ్నాథ్ పర్యటించనున్నారు. విశాఖతో పాటు విజయవాడ, ఏలూరులోనూ రాజ్నాథ్ సింగ్ పర్యటించనున్నారు. పలు అభివృద్ధి కార్యక్రమంలో పాల్గొని ప్రజలనుద్దేశించి ప్రసంగించనున్నారు. ముందుగా ఢిల్లీ నుంచి విజయవాడకు చేరుకుని రాష్ట్ర బీజేపీ నాయకులతో భేటీ అవుతారు. రాష్ట్రంలో బీజేపీ పరిస్థితులపై వారితో చర్చించనున్నారు. అనంతరం ఏలూరులో బీజేపీ కార్యకర్తల సమ్మేళనంలో కేంద్రమంత్రి రాజ్నాథ్సింగ్ పాల్గొననున్నారు.