Anantapuram: అనంతపురం జిల్లా కదిరిలో విషాదం

*పక్కనున్న భవనాలపై పడ్డ నిర్మాణ భవనం *ఇప్పటి వరకు ఇద్దరు చిన్నారులు మృతి

Update: 2021-11-20 05:51 GMT

అనంతపురం జిల్లా కదిరిలో విషాదం(ఫైల్ ఫోటో)

Anantapuram: అనంతపురం జిల్లా కదిరిలో విషాదం చోటు చేసుకుంది. పాత చైర్మన్ వీధిలో నిర్మాణంలో ఉన్న మూడంతస్తుల భవనం కూలి పక్కనే ఉన్న మరో రెండు భవనాలపై దాని శిథిలాలు పడ్డాయి. ఈ ఘటనలో దాదాపు 15 మందిలో శిథిలాల కింద చిక్కుకున్నారు.

ప్రమాదంలో ఇద్దరు చిన్నారులు మృతిచెందారు. శిథిలాల కింది చిక్కుకున్న ఎనిమిది మందిని సురక్షితంగా కాపాడారు. కుండపోత వర్షం కారణంగానే భవనం దెబ్బతిని. ఈ ఘటన జరిగినట్లు అధికారులు భావిస్తున్నారు.

సంఘటనా స్థలానికి చేరుకున్న అధికారులు జేసీబీతో శిథిలాలను తొలగిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలను ముమ్మరం చేశారు. 

Tags:    

Similar News