YV Subba Reddy: ఆ పది రోజులు వీఐపీ బ్రేక్‌ దర్శనాలు రద్దు

Tirumala: సెప్టెంబర్‌ 27 నుంచి అక్టోబర్‌ 6 వరకు శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నట్టు టీటీడీ చైర్మన్‌ వైవి సుబ్బారెడ్డి వెల్లడించారు.

Update: 2022-09-02 10:25 GMT

YV Subba Reddy: ఆ పది రోజులు వీఐపీ బ్రేక్‌ దర్శనాలు రద్దు

Tirumala: సెప్టెంబర్‌ 27 నుంచి అక్టోబర్‌ 6 వరకు శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నట్టు టీటీడీ చైర్మన్‌ వైవి సుబ్బారెడ్డి వెల్లడించారు. సెప్టెంబర్‌ 27న సీఎం జగన్.. స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పిస్తారన్నారు. కరోనా కారణంగా గత రెండేళ్లుగా బ్రహ్మోత్సవాలు ఏకాంతంగా నిర్వహించామని, ఈ సారి భక్తుల సమక్షంలోనే బ్రహ్మోత్సవాలు జరుగుతాయన్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా చర్యలు చేపడుతున్నట్టు చెప్పారు. ఇక బ్రహ్మోత్సవాలు నిర్వహించే పది రోజులు విఐపీ బ్రేక్‌ దర్శనాలు, శ్రీవాణి బ్రేక్ దర్శనాలు రద్దు చేసినట్లు టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి తెలిపారు.

Tags:    

Similar News