Bhanu Prakash Reddy: ఆ లెక్కలన్నీ బయటపెడతాం: భూమనకు భానుప్రకాశ్ రెడ్డి వార్నింగ్
Bhanu Prakash Reddy: హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా మాజీ టీటీడీ చైర్మన్ కరుణాకర్ రెడ్డి వ్యాఖ్యలు చేయడం.. బాధాకరమని పాలకమండలి సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి మండిపడ్డారు.
Bhanu Prakash Reddy: హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా మాజీ టీటీడీ చైర్మన్ కరుణాకర్ రెడ్డి వ్యాఖ్యలు చేయడం.. బాధాకరమని పాలకమండలి సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి మండిపడ్డారు. భూమన హయాంలో జరిగిన అవకతవకలకు సంబంధించిన లెక్కలన్నీ త్వరలోనే బయటపెడతామని హెచ్చరించారు. తిరుమల శ్రీవారిని ఆయన దర్శించుకున్నారు. కోట్లాది మంది హిందువుల ఆరాధ్య దైవం వేంకటేశ్వర స్వామిపై.. ఉద్దేశపూర్వకంగా తప్పులు చూపడం సరైంది కాదన్నారు.
గతంలో కరుణాకర్ రెడ్డి హయాంలో పరివట్టం కట్టారు, స్వామి వారి వస్త్రం కప్పి టీటీడీ నియమాలను ఉల్లంఘించారని ఆరోపించారు. రంగనాయకుల మండపంలో, జయవిజయుల దగ్గర జరగాల్సిన కార్యక్రమాన్ని వెంకయ్య చౌదరి ఇంటి వద్ద ఎందుకు నిర్వహించారో ప్రజలకు చెప్పాలని భానుప్రకాష్ రెడ్డి ప్రశ్నించారు.