ఎస్వీబీసీ సీఈఓ పోస్టు దరఖాస్తుకు టీటీడీ ఆహ్వానం
తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) శుభవార్త అందించింది.
తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) శుభవార్త అందించింది. టీటీడీ ఆధ్వర్యంలో నడిచే శ్రీ వేంకేశ్వర భక్తి ఛానల్ ( ఎస్వీబీసీ) చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్(సీఈఓ) పోస్టును భర్తీ రంగం సిద్దం చేసింది. మూడేళ్ల కాలపరిమితికి ఎస్వీబీసీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పోస్టుకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు చేసుకోవాలని కోరుతోంది. హిందువులు మాత్రమే ఈ పోస్టుకు అర్హులని పేర్కొన్నారు.
ఈ పోస్టుకు దరఖాస్తులు చేసేందుకు మే 29 చివరి తేదీగా నిర్ణయించారు. 2020 ఏప్రిల్ 1 నాటికి 40 ఏళ్ల నుంచి 55 సంవత్సరాల వయస్సు కలిగి ఉండాలి. విద్యార్హతలు, అనుభవం తదితర వివరాలతో పాటు దరఖాస్తు ఫారం కోసం www.svbcttd.com వెబ్సైట్ను సంప్రదించగలరు. దరఖాస్తులను పూర్తి చేసి mdsvbc@gmail.comకు మెయిల్ కు పంపాలి.