Andhra Pradesh: కుప్పంలో వైసీపీ, టీడీపీల మధ్య ఘర్షణ

త్తూరు జిల్లా కుప్పంలో ద్రావిడ యూనివర్సిటీలో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. వైసీపీ, టీడీపీల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది.

Update: 2020-01-25 09:57 GMT

చిత్తూరు జిల్లా కుప్పంలో ద్రావిడ యూనివర్సిటీలో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. వైసీపీ, టీడీపీల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు దిష్టిబొమ్మను కాల్చడానికి వైసీపీ విద్యార్థి విభాగం కార్యకర్తలు ప్రయత్నించారు.. దాంతో కొంతమంది టీడీపీ కార్యకర్తలు అక్కడికి చేరుకున్నారు. టీడీపీ కార్యకర్తలు రావడంతో వైసీపీ కార్యకర్తలు టీడీపీ వాళ్ళను ఉద్ద్యేశించి విమర్శలు చేశారు. టీడీపీ వారు కూడా ప్రతి విమర్శలు చేయడంతో గొడవకు దారి తీసింది. కాసేపటికే పరిస్థితి మరింత ఉద్రిక్తత గా మారింది.

సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకున్నారు. ఆందోళనకారులను చెదరగొట్టారు. కాగా మూడు రాజధానులను వ్యతిరేకిస్తూ టీడీపీ నిర్ణయం తీసుకోవడంతో ఈ ఘటనకు కారణమైంది. గొడవలు చెలరేగే అవకాశం ఉందన్న అనుమానంతో పోలీసులు భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. దాడులకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇక ఈ ఘటనతో యూనివర్సిటీలో విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.




Tags:    

Similar News