ఏపీలో త్వరలోనే తెరుచుకోనున్న దేవాలయాలు

Update: 2020-05-16 07:56 GMT

ఏపీలో త్వరలోనే ఆలయాలు తెరుచుకోనున్నాయి. దీనికి సంబంధించి మార్గదర్శకాలను దేవదాయశాఖ విడుదల చేసింది. లాక్‌డౌన్‌ నిబంధనలను పాటిస్తూ దర్శనం చేసుకునే విధంగా ఏర్పాట్లు చేయాలని అన్ని ఆలయాల ఈవోలకు ఆదేశాలు జారీ చేసింది. ముఖ్యంగా ఆన్‌లైన్‌ లోనే టిక్కెట్లు బుక్ చేసుకునేలా చూడాలని భౌతిక దూరం పాటిస్తూ దర్శనం చేసుకునేందుకు ఏర్పాటు చేయాలని సూచించింది. డిస్ ఇన్ఫెక్షన్ టన్నెల్‌తో పాటు శానిటైజ్ చేసుకునే విధంగా ఏర్పాటు చేసుకోవాలి తెలిపింది. ఎప్పటికప్పుడు గుడి పరిసరాలు, క్యూ లైన్లలో సోడియం హైపోక్లోరైడ్‌తో స్ప్రే చేయాలని ప్రతి దేవాలయంలో అన్ని జాగ్రత్తలు తప్పనిసరి పాటించాలని దేవాదాయశాఖ తన ఆదేశాల్లో పేర్కొంది.  

Tags:    

Similar News