తమను ప్రత్యేక గ్రూప్గా పరిగణించాలంటూ నలుగురు ఎంపీలు లేఖ ఇవ్వడంతో రాజ్యసభలో తెలుగుదేశం దాదాపు ఖాళీ అయ్యింది. రాజ్యసభలో కేవలం ఇద్దరు ఎంపీలు మాత్రమే టీడీపీకి మిగిలారు. అయితే రాజ్యసభలో టీడీపీ దాదాపు ఖాళీ అయిన నేపథ్యంలో టీడీపీ లోక్సభ ఎంపీల దారెటనే చర్చ జరుగుతోంది. టీడీపీకి లోక్సభలో ముగ్గురు ఎంపీలు ఉండగా వీళ్లు కూడా చంద్రబాబుకి షాకిస్తారనే ప్రచారం జరుగుతోంది. ఇదే సమయంలో టీడీపీ ఎంపీలు కేశినేని నాని, గల్లా జయదేవ్, రామ్మోహన్నాయుడు లోక్సభ స్పీకర్ను కలవడం కలకలం రేపుతోంది.