గోరంట్ల మాధవ్‌పై లోక్‌సభ స్పీకర్‌కు టీడీపీ ఎంపీల ఫిర్యాదు

TDP MPs: ఎంపీ గోరంట్ల మాధవ్ ఎపిసోడ్‌పై లోక్‌సభ స్పీకర్‌కు టీడీపీ ఎంపీలు ఫిర్యాదు చేశారు.

Update: 2022-08-09 11:49 GMT

గోరంట్ల మాధవ్‌పై లోక్‌సభ స్పీకర్‌కు టీడీపీ ఎంపీల ఫిర్యాదు

TDP MPs: ఎంపీ గోరంట్ల మాధవ్ ఎపిసోడ్‌పై లోక్‌సభ స్పీకర్‌కు టీడీపీ ఎంపీలు ఫిర్యాదు చేశారు. గోరంట్లపై చర్యలు తీసుకోవాలని స్పీకర్‌ను కోరామని ఎంపీ రామ్మోహన్ నాయుడు తెలిపారు. దీనిపై విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని చెప్పారన్నారు. జాతీయ మహిళా కమిషన్‌కు కూడా ఫిర్యాదు చేస్తామన్నారు. ఎంపీ గోరంట్లను కాపాడాలని వైసీపీ నేతలు యత్నిస్తున్నారని, గోరంట్లపై చర్యలు తీసుకోవడానికి ఆ పార్టీ నేతలు భయపడుతున్నారని రామ్మోహన్ విమర్శించారు.

Tags:    

Similar News