వైసీపీ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవిని కులం పేరుతో దూషించారు కొందరు నేతలు. వినాయకచవితి వేడుకల సాక్షిగా ఈ ఘటన జరిగింది. వినాయక చవితి సందర్బంగా తుళ్లూరు మండలంలోని అనంతవరంలో ఏర్పాటు చేసిన వినాయకుడి విగ్రహానికి పూజలు నిర్వహించడం కోసం స్థానిక ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి వచ్చారు. అయితే ఆమె వ్యతిరేకులు కొందరు పూజలు చేయడాన్ని వ్యతిరేకించారు. శ్రీదేవి గణేష్ చతుర్థి వేడుకల్లో పాల్గొంటే వినాయకుడు మైలపడతాడు అంటూ హేళన చేశారు. దీంతో మనస్తాపానికి లోనైనా ఎమ్మెల్యే కంటతడి పెట్టారు. ఈ క్రమంలో టీడీపీ, వైసీపీ కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది.