పంచాయతీ ఎన్నికల్లో వైసీపీ ఆగడాలను అడ్డుకోవాలి: బోండా ఉమ

Update: 2021-02-16 10:03 GMT

పంచాయతీ ఎన్నికల్లో వైసీపీ ఆగడాలను అడ్డుకోవాలి: బోండా ఉమ 

ఏపీలో ఎన్నడూలేని విధంగా పంచాయతీ ఎన్నికల్లో బలవంతంగా ఏకగ్రీవాలు జరుగుతున్నాయని టీడీపీ నేత బోండా ఉమ విమర్శించారు. పుంగనూరు, మాచర్ల, పులివెందుల, శ్రీకాళహస్తిలో జరిగిన ఎన్నికల్లో ఎన్నోఅక్రమాలు జరిగాయని ఆరోపించారు. విజయవాడలో ఎన్నికల కమిషన్ కు బోండా ఉమ సారధ్యంలో టీడీపీ నేతలు కలిశారు. పంచాయతీ ఎన్నికల అక్రమాలను ఫిర్యాదు చేశారు. పంచాయతీ ఎన్నికల్లో అధికార వైసీపీ ఆగడాలపై చర్యలు తీసుకోవాలని కోరినట్లు బోండా ఉమ వెల్లడించారు.

Tags:    

Similar News