రాష్టంలో మహిళలకు రక్షణ లేదు: వంగలపూడి అనిత
International Women's Day: విజయవాడలో దుర్గగుడికి వెళ్తున్న మహిళలను పోలీసులు బూటు కాళ్లతో తన్నడం సిగ్గుచేటని టీడీపీ మహిళ నేత వంగలపూడి అనిత అన్నారు. మహిళల రక్షణపై సీఎం జగన్కు బాధ్యత లేదని విమర్శించారు. ఇవాళ మహిళా దినోత్సవమని చెప్పుకోవడానికే సిగ్గుగా ఉందన్నారు. ఒక మహిళా హోం మంత్రిగా ఉన్న రాష్టంలో కూడా మహిళలపై దాడులు జరుగుతున్నాయని మండిపడ్డారు. మహిళలు దుర్గ గుడికి పోవాలంటే ప్రభుత్వం దగ్గర పర్మిషన్ తీసుకోవాల అని ప్రశ్నించారు. రాజధాని మహిళల వస్త్రాలు చినిగిపోయిన పట్టించుకోని ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం అని అనిత పేర్కొన్నారు.