ఏపీలో ప్రభుత్వ భవనాలకు వైసీపీ రంగులు వేయడంతో వాటిని చెరిపివేయాలంటూ హైకోర్టు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. మరో సారి పార్టీ రంగులపై దుమారం చెలరేగెలా వుంది. వైసీపీ జెండా రంగులు ఆంబులెన్స్లకు వేసేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోందని టీడీపీ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమా ఆరోపించారు. దీనికి సంబంధించి ఆయన ఓ ఫొటోను పోస్ట్ చేశారు ప్రజాధనంతో కొనుగోలు చేసిన ఈ అంబులెన్సులని వైసీపీ రంగులు వెయ్యడానికి కొన్ని నెలలుగా విజయవాడ లోని మెడికల్ కాలేజీలో పెట్టి ఉంచారు , కరోనా వైరస్ క్లిష్ట సమయాల్లో కూడా మీకు మీ పార్టీ నాయకులకి ఈ రంగుల పబ్లిసిటీ పిచ్చి ఏంటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అంటూ ట్వీట్ చేశారు.