అనంతపురం శిశుకేర్ ఆస్పత్రి దగ్గర తీవ్ర ఉద్రిక్తత

Update: 2019-12-08 06:30 GMT
ప్రతీకాత్మక చిత్రం

అనంతపురంలోని శిశుకేర్ ఆస్పత్రి దగ్గర తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఇంద్రనీల్ అనే ఐదేళ్ల చిన్నారి మృతి చెందడంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. మూడు రోజుల క్రితం డెంగ్యూ జ్వరం రావడంతో తమ బిడ్డను ఆస్పత్రిలో చేర్చామని, అయితే జ్వరానికి సంబంధించిన మెడిసిన్ కాకుండా ఇతర మందులు ఇచ్చారని చిన్నారి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.

అర్ధరాత్రి 2 గంటలకు మరణించాడని వైద్యులు చెబుతున్నారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమకు న్యాయం చేయాలని నినాదాలు చేశారు. దీంతో ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు ఆందోళనకారులను అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నారు.




Tags:    

Similar News