Sajjala RamaKrishna: 5,10 ఏళ్లలో హైలీ ఎడ్యుకేటెడ్ రాష్ట్రంగా ఏపీ

Sajjala Ramakrishna: విద్యకు వైసీపీ ప్రభుత్వం పెద్ద పీట వేసింది - సజ్జల

Update: 2021-11-11 10:50 GMT
5, 10 ఏళ్లలో ఏపీ హైలీ ఎడ్యుకేటెడ్ రాష్ట్రంగా మారుతుందన్నరు సజ్జల రామకృష్ణ (ఫైల్ ఇమోజ్)

Sajjala Ramakrishna:  5,10 ఏళ్లలో హైలీ ఎడ్యుకేటెడ్ రాష్ట్రంగా ఏపీ అవతరించబోతోందని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణ అన్నారు. వైసీపీ ప్రభుత్వం విద్యకు పెద్ద పీట వేసిందని స్కూళ్లకు వెళ్లే పిల్లలకు డ్రెస్‌లు, బూట్లు, పుస్తకాలు, పౌష్టికాహారం ఇవ్వటంతో పాటు పేద విద్యార్ధులకు అమ్మఒడితో ఆదుకుంటుందని వివరించారు. చంద్రబాబు సొంత ఊరిలో శిధిలావస్థలో ఉన్న ప్రభుత్వ పాఠశాలకు నాడు నేడు కింద బాగు చేసామని సజ్జల గుర్తు చేసారు. ఎయిడెడ్ స్కూల్స్ పై టీడీపీ రాద్ధాంతం చేస్తోందని లోకేష్ తన మనుగడ కోసం అనవసరంగా రచ్చ చేస్తున్నాడని విమర్శించారు సజ్జల.

Tags:    

Similar News