శబరి ఎక్స్‌ప్రెస్‌కు తప్పిన పెను ప్రమాదం.. పట్టాలపై ఇనుప రాడ్డు కట్టిన..

* లోకోపైలట్ అప్రమత్తతతో తప్పిన పెను ప్రమాదం

Update: 2022-11-01 06:51 GMT

శబరి ఎక్స్‌ప్రెస్‌కు తప్పిన ప్రమాదం

Shabari Express: హైదరాబాద్ నుంచి తిరువనంతపురం వెళ్తున్న శబరి ఎక్స్‌ప్రెస్‌కు గుంటూరు వద్ద పెను ప్రమాదం తప్పింది. పట్టాలపై దుండగులు కట్టిన ఇనుపరాడ్డును గుర్తించిన లోకోపైలట్ వెంటనే అప్రమత్తమై రైలును నిలిపివేశాడు. దీంతో రాడ్డు సమీపానికి వచ్చి రైలు ఆగిపోయింది. రైలును ఆపిన అనంతరం రైల్వే సిబ్బంది రాడ్డును తొలగించారు. అయితే దుండగులు పొడవైన ఇనుపరాడ్డును పట్టాలపై అడ్డంగా పెట్టి, రైలు వస్తున్నప్పుడు దాని అదురుకు అది కిందికి పడిపోకుండా పట్టాలకు గుడ్డతో కట్టారు. 

Full View


Tags:    

Similar News