ప్రకాశం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురి మృతి

Update: 2019-07-28 09:35 GMT

తిరుమల శ్రీవెంకటేశ్వరస్వామి దర్శనం చేసుకుని సంతోషంతో ఇంటికి తిరిగి వెళ్తున్న ఆ కుటుంబాన్ని మృత్యువు కాటేసింది. పాల ట్యాంకర్‌ను ఢీకొన్న ఘటనలో నలుగురు అక్కడిక్కడే మృతి చెందగా..ఇద్దరు తీవ్ర గాయాల పాలయ్యారు. ప్రకాశం జిల్లా మద్దిపాడు మండలం గుండ్లపల్లి వద్ద ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఇక వివరాల్లోకి వెళితే కృష్ణా జిల్లా ఉయ్యూరు మండలం మేడూరుకు చెందిన ఓ కుటుంబంలోని ఐదుగురు సభ్యులు తిరుమలకి వెళ్లి తిరుగుపయనంలో ప్రకాశం జిల్లా మద్దిపాడు మండలం గుళ్ళాపల్లి వద్దకు రాగానే అదుపుతప్పి పాల ట్యాంకర్‌ను ఢీకొంది. ఈ ఘటనలో డ్రైవర్‌ సాంబారెడ్డి(44)తో పాటు పాండురంగారావు(42), నరసింహారావు(40), సత్యసాగర్‌ (10) మృతి చెందారు. అనురాధ, సుప్రియ అనే ఇద్దరు చిన్నారులు తీవ్రంగా గాయపడ్డారు. వీరిని చికిత్స నిమిత్తం దగ్గర్లో ఉన్న ఆస్పత్రికి తరలించారు.  

Tags:    

Similar News