కర్నూల్ జిల్లాలో పదో తరగతి ప్రశ్నపత్రం లీకేజీ కలకలం రేగింది. పరీక్ష ప్రారంభమైన కొంత సమయానికే ప్రశ్నపత్రం వాట్సాప్లో చక్కర్లు కొట్టింది.ఈ విషయం జిల్లా విద్యాధికారులకు తెలియడంతో వెంటనే పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేశారు. పదో తరగతి వార్షిక పరీక్షల్లో భాగంగా శనివారం సోషల్ పేపర్-2 జరిగింది. దీనికి సంబంధించిన ప్రశ్నపత్రాన్ని ఫొటో తీసి వాట్సాప్లో బయటకు పంపించారు గుర్తుతెలియని వ్యక్తులు.
అధికారుల ఫిర్యాదుతో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. పరీక్ష కేంద్రంలో విధులు నిర్వహించే సిబ్బందే ఫోన్ ద్వారా ఫోటో తీసి బయటకు పంపి ఉంటారని వారు భావిస్తున్నారు. ఈ ఘటనకు కారణమైన వ్యక్తులపై చర్యలు తీసుకోవాలంటూ డీఈవో ఆదేశాలు జారీ చేశారు.