పశ్చిమగోదావరి జిల్లాలో ప్రైవేట్ ట్రావెల్స్ మినీ బస్ బోల్తా..

Update: 2019-06-16 00:54 GMT

పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం మండలం మద్ది ఆంజనేయస్వామి గుడి సమీపంలో ప్రైవేటు ట్రావెల్స్ కి చెందిన ఓ మినీ బస్ బోల్తా పడింది. ఏలూరు తంగెళ్ళమూడి నుండి తెలంగాణ రాష్ట్రం భద్రాచలం పెళ్లికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో చిన్న పిల్లలతో కలిపి సుమారు 25 మంది ప్రయాణీకులు ఉండగా అందరికి తీవ్ర గాయాలు అయ్యాయి. సమాచారం తెలుసుకున్న లక్కవరం పోలీస్‌లు సంఘటన స్థలానికి చేరుకుని సహాయ చర్యలు అందించారు. జంగారెడ్డిగూడెం, కామవరపు కోట, బుట్టాయిగూడెం, ద్వారకాతిరుమల నుంచి నాలుగు 108 వాహనాలను అత్యవసరంగా ప్రమాద స్థలానికి రప్పించి క్షతగాత్రులను జంగారెడ్డిగూడెం ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఆరుగురిని మెరుగైన చికిత్స నిమిత్తం ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బస్ ప్రమాదం అనంతరం బస్ డ్రైవర్ పరారయ్యాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Tags:    

Similar News