ఎంపీ మాధవ్ ఘటన ఫిర్యాదుపై స్పందించిన రాష్ట్రపతి కార్యాలయం

Gorantla Madhav: ఎంపీ మాధవ్ ఘటనపై ఫిర్యాదుకు రాష్ట్రపతి కార్యాలయం స్పందించింది.

Update: 2022-08-29 15:23 GMT

ఎంపీ మాధవ్ ఘటన ఫిర్యాదుపై స్పందించిన రాష్ట్రపతి కార్యాలయం 

Gorantla Madhav: ఎంపీ మాధవ్ ఘటనపై ఫిర్యాదుకు రాష్ట్రపతి కార్యాలయం స్పందించింది. మహిళా నేతల ఫిర్యాదును రాష్ట్రపతి కార్యాలయం రాష్ట్ర సీఎస్‌కు పంపించింది. తగిన చర్యలు తీసుకోవాలని రాష్ట్రపతి కార్యాలయం సూచించింది. మాధవ్‌పై చర్యలు తీసుకునేలా చూడాలని మహిళా ఐకాస నేతలు కోరారు. ఇటీవల ఢిల్లీ వెళ్ళిన మహిళా ఐకాస ఎంపి మాధవ్‌పై చర్యలు తీసుకోవాలని రాష్ట్రపతి ముర్మును అభ్యర్థించారు. ఉపరాష్ట్రపతి, జాతీయ మహిళా కమిషన్, కేంద్రమంత్రులకూ మహిళా ఐకాస ఫిర్యాదు చేసింది. ఈమేరకు ఐకాస కన్వీనర్ చెన్నుపాటి కీర్తికి రాష్ట్రపతి కార్యాలయం లేఖ పంపింది.

Tags:    

Similar News