ప్రత్తిపాడు: కరోనా వైరస్ కారణంగా లాక్ డౌన్ నేపథ్యంలో ఇంట్లోంచి ఎవరు బయటి రాకూడదని సూచించిన ప్రత్తిపాడులో ఉదయం సమయంలో ప్రధాన రహదారి వెంట ప్రజలు గుంపులుగుంపులుగా చేరారు. దీంతో స్థానిక ఎస్ఐ అశోక్ కుమార్ సిబ్బందితో కలిసి అక్కడి చేరుకొని వారికి అవగాహన కలిపించారు. ప్రజలు ఎవరు ఇంట్లోంచి బయటకు రావద్దు అని, మనిషికి మనిషికి దూరం పాటించాలని సూచించారు.