కాకినాడ: కరోనా మహమ్మారిని తరిమేందుకు విధులు నిర్వహిస్తున్న పోలీస్, వైద్యశాఖ, ఇతర శాఖల సిబ్బంది తమ ఆరోగ్య రక్షణ కోసం వ్యక్తి గత జాగ్రత్తలు పాటించాలని జిల్లా ఎస్పీ అద్నాన్ నయిం అస్మి సూచించారు.
మంగళవారం కాకినాడ జిల్లా ఎస్పీ కార్యాలయంలో సరిహద్దులోని జాతీయ రహదారిపై విధులు నిర్వహిస్తున్న పోలీస్ సిబ్బందికి అందజేస్తున్న సబ్బులు, మాస్కులను ఎస్పీ పరిశీలించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. కరోనా వైరస్ నిర్మూలన కోసం నిరంతరం పోలీస్ సిబ్బంది కృషి చేయడం జరుగుతుందన్నారు.