నర్సాపురం: పట్టణంలో కరోనా పాజిటివ్ కేసు నమోదుకావడంతో గత మూడు రోజులుగా అన్ని దుకాణాలను మూసివేశారు. బుధవారం మూడు గంటల పాటు కిరాణా, రైతు బజార్ తెరవడంతో ప్రజలు బారులు తీరారు. ప్రశాంతంగా ఉన్న పట్టణాన్ని కరోనా కేసు ఒక్క కుదుపుకుదిపింది. దీంతో అధికారులతో పాటు పట్టణ పరిసర ప్రజలు ఉలిక్కిపరడ్డారు. కరోనా వ్యాధి నివారణకు ప్రభుత్వ యంత్రాంగం కఠిన నిర్ణయాలు తీసుకుంది.