గోకవరం: మండల కేంద్రంలో ప్రభుత్వ ఆదేశాల మేరకు లాక్ డౌన్ భాగంగా... ప్రజలందరూ నిత్యవసర వస్తువులకు దుకాణాలకు వెళ్లి మనిషి మనిషికి రెండు మీటర్ల దూరంలో ఉండి కొనుగోలు చేయాలని స్థానిక ఎస్ఐ చెన్నారావు అన్నారు. నిత్యవసర వస్తువులను అధిక ధరలకు అమ్మితే తమకు తెలియపరచాలని అన్నారు. తమను కాదని ఎవరైనా బయట తిరిగితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.