Nakkapalle: కరెంటు బిల్లుల చెల్లింపుకి మినహాయింపు ఇవ్వాలి

Update: 2020-04-08 07:27 GMT

నక్కపల్లి: విద్యుత్ వినియోగ దారులకు కరెంట్ బిల్లులు హచెల్లింపు నుండి మినహాయింపు ఇవ్వాలని సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు ఎం.అప్పలరాజు డిమాండ్ చేశారు. కరోనా వ్యాప్తి నిరోదించడానికి ప్రభుత్వం లాక్ డౌన్ అమలు చేస్తున్న నేపద్యంలో జన జీవనం స్థంభించి పోయిందన్నారు. ఈ పరిస్థితులలో అన్ని వర్గాల ప్రజలు బిల్లులు చెల్లించలేని పరిస్థితిలో ఉన్నారన్నారు. అయితే విద్యుత్ శాఖ నుండి బిల్లులు చెల్లించాలని ఫోన్ మెసేజ్ లు వస్తున్నాయన్నారు.

గత నెల ఎంత బిల్లు చెల్లించారో, అంతే మొత్తాన్ని ప్రస్తుత నెల బిల్లుగా భావించి కరెంట్ బిల్లులు చెల్లించాలంటూ ఆ మెసేజ్ ల ద్వార తెలుపుతున్నారన్నారు. దీనిని ప్రభుత్వం పునఃపరిశీలన చేసి వినియోగ దారులకు విద్యుత్ బిల్లు చెల్లింపులు నుండి మినహాయింపు కల్పించే విధంగా విద్యుత్ శాఖకు ఆదేశాలు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.


Tags:    

Similar News