Pawan Kalyan: జనసేన పార్టీ కోసం రూ.10 కోట్లు విరాళంగా ఇచ్చిన పవన్ కల్యాణ్
Pawan Kalyan: రూ.10 కోట్లు పార్టీ కోశాధికారి రత్నంకు అందజేసిన పవన్
Pawan Kalyan: జనసేనాని పవన్.. తన సొంత పార్టీకి విరాళం ఇచ్చారు. పదికోట్ల రూపాయలను పార్టీ కోశాధికారి రత్నంకు అందజేశారు. నెహ్రూ లాంటి నాయకులు స్వతంత్ర్య ఉద్యమాన్ని ముందుకు నడిపేందుకు తమ కష్టార్జీతాన్ని విరాళంగా ఇచ్చారని కొనియాడారు పవన్. తన పార్టీ కోసం కొందరు కూలీ చేసి మరీ డబ్బులు పంపుతున్నారని తెలిపారు. ఆ స్ఫూర్తితోనే ఓ సదాశయం కోసం, రాష్ట్ర అభివృద్ధిని సుందరంగా తీర్చిదిద్దడం కోసం పార్టీ సాగిస్తున్న ప్రయాణానికి తన వంతు విరాళం అందించానని వెల్లడించారు.