బీజేపీతో వైసీపీ కలిస్తే తప్పులేదని జనసేన అధినేత పవన్ కల్యాణ్ చెప్పారు. ఇందులో జనసేన ఉండదని ఆయన స్పష్టం చేశారు. రాజధాని అమరావతి కోసం షరతులు లేకుండా బీజేపీతో పొత్తు పెట్టుకున్నామని చెప్పారు. అమరావతిలోని మందడంలో రైతులకు దీక్షకు పవన్ సంఘీభావం తెలిపారు. వైసీపీతో బీజేపీ పొత్తు పెట్టుకోదని భావిస్తున్నట్లు పవన్ చెప్పారు.