బస్సులో ప్రయాణిస్తూ గుండెపోటుతో వ్యక్తి మృతి

ఆర్.టి.సి బస్సులో ప్రయాణిస్తూ బ్రాహ్మణపల్లి కు చెందిన సగినాల సిద్దయ్య ( 58) అనే వ్యక్తి గుండెపోటుతో మృతి చెందాడు.

Update: 2019-11-22 07:09 GMT
Representational image

కడప: ఆర్.టి.సి బస్సులో ప్రయాణిస్తూ బ్రాహ్మణపల్లి కు చెందిన సగినాల సిద్దయ్య ( 58) అనే వ్యక్తి గుండెపోటుతో మృతి చెందాడు.

ఈరోజు ఉదయం అనారోగ్యంగా ఉండడంతో సిద్దయ్య అనే వ్యక్తి కడపకు చికిత్స కోసం వెళ్లారు. తిరిగి సాయంత్రం కడప నుంచి రాజంపేట బస్సులో వస్తు గుండెపోటు రావడంతో మృతి చెందినట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు. విషయం తెలిసిన వెంటనే అధికారులు బస్సును  బస్టాండ్ కు తీసుకువచ్చి మృతదేహాన్ని బంధువులకు అప్పజెప్పారు. 

Tags:    

Similar News