ఏపీలో మరో కరోనా పాజిటివ్ కేసు నమోదయ్యింది. ప్రకాశం జిల్లాలో ఒకరికి కరోనా పాజిటివ్ ఉన్నట్లు రాష్ట్ర వైద్యశాఖ బులెటిన్ విడుదల చేసింది. అయితే ఇప్పటికే నెల్లూరు జిల్లాలో ఒకరికి కరోనా పాజిటివ్ రాగా మొత్తం109 మంది శాంపిల్స్ సేకరించారు. 94 మందికి నెగిటివ్ రిపోర్ట్ వచ్చింది. మరో 13 మంది రిపోర్ట్స్ రావాల్సి ఉందని వైద్యశాఖ వెల్లడించింది.
కరోనా వైరస్ నియంత్రణకు పటిష్ట చర్యలు చేపట్టినట్లు వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కేఎస్ జవహర్రెడ్డి తెలిపారు. కరోనా వైరస్ నిరోధక చర్యలపై ఏపీ ప్రభుత్వం బులెటిన్ విడుదల చేసింది. ప్రకాశం జిల్లాలో కరోనా (కొవిడ్-19) పాజిటివ్ కేసు నమోదయిందని తెలిపారు. నెల్లూరు జిల్లాలో కరోనా బాధితుడు కోలుకుంటున్నారని పేర్కొన్నారు. ప్రతి జిల్లాలోని బోధన, జిల్లా ఆసుపత్రుల్లో ఐసోలేషన్ వార్డులు ఏర్పాటు చేశామని తెలిపారు.