విదేశాల నుంచి వచ్చిన 465 మంది గుర్తింపు
వివిధ కారణాలతో విదేశాలకు వెళ్లి తిరిగొచ్చిన 465 మందిని... గాజువాక ప్రాంత అధికారులు గుర్తించారు.
గాజువాక: వివిధ కారణాలతో విదేశాలకు వెళ్లి తిరిగొచ్చిన 465 మందిని... గాజువాక ప్రాంత అధికారులు గుర్తించారు. వారిలో కొంతమందిని క్వారంటైన్ వార్డుకు తరలించగా, మిగిలినవారిని గృహ నిర్బంధంలో ఉంచారు. గాజువాక, పెదగంట్యాడ, స్టీల్ప్లాంట్, కూర్మన్నపాలెం, పరవాడ పరిసర ప్రాంతాల నుంచి వారు పలు దేశాలకు వెళ్లారు. వారిలో కొంతమంది మక్కాను దర్శించుకున్నవారు కూడా ఉన్నట్టు అధికారులు తెలిపారు.
విశాఖ నగరం నుంచి మక్కాకు వెళ్లిన ఒక వ్యక్తికి... కరోనా పాజిటివ్ వచ్చిన నేపథ్యంలో ఇక్కడ కూడా అధికారులు పటిష్ట చర్యలు తీసుకున్నారు. గాజువాక జోన్లో వార్డు, మండల స్థాయి కమిటీలను ఏర్పాటు చేసిన అధికారులు విదేశాలకు వెళ్లి వచ్చినవారి వివరాలను ఆ కమిటీలద్వారా సేకరించారు.