నెల్లూరు జిల్లాలో కరోనా అలజడి.. ఉట్లపల్లి పరిసర ప్రాంతాలు రెడ్ జోన్‌గా ప్రకటన

Update: 2020-04-04 08:19 GMT

నెల్లూరు జిల్లాలో కరనో అలజడి రేపింది. బాలాయపల్లి మండలం ఉట్లపల్లిలో ఓ వ్యక్తికి కరోనా లక్షణాలు ఉన్నట్లు నిర్ధారించారు. ఢిల్లీ నుంచి వచ్చిన వ్యక్తిని మూడు రోజుల క్రితం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఉట్లపల్లి గ్రామం పరిసర ప్రాంతాల్లో మూడు కిలోమీటర్ల పరిధిలో రెడ్ జోన్ గాప్రకటించారు. కరోనా పాజిటివ్ వ్యక్తికి సంబంధించిన ఎనిమిది మంది కుటుంబ సభ్యులను క్వారంటయిన్ కు తరలించారు. గ్రామంలో పారిశుద్య పనులు చేపట్టారు. ప్రజలు లాకౌ డౌన్ పాటించాలని అధికారులు ఆదేశించారు.

యుద్ధ ప్రాతిపదికన గ్రామంలో మరియు పరిసరాల్లో పారిశుద్ధ్య పనులు చేపట్టిన అధికారులు. ప్రజలందరూ లాక్ డౌన్ ను కచ్చితంగా పాటించి, కరోనా వైరస్ ను తరిమి కొట్టాలని పిలుపునిచారు.


Full View


Tags:    

Similar News