Breaking News: ఏపీ నూతన ఎన్నికల కమిషనర్‌గా నీలం సాహ్ని

ఎస్‌ఈసీగా నీలం సాహ్నీని నియమించిన గవర్నర్‌

Update: 2021-03-26 15:28 GMT

Breaking News: ఏపీ నూతన ఎన్నికల కమిషనర్‌గా నీలం సాహ్ని

Breaking News: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నూతన ఎన్నికల కమిషనర్‌గా నీలం సాహ్నిని గవర్నర్ నియమించారు. ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా రిటైరైన సాహ్ని ప్రస్తుతం సీఎం జగన్ ముఖ్య సలహాదారుగా కొనసాగుతున్నారు. ప్రస్తుత ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ పదవీ కాలం ఈ నెలాఖరుతో ముగియనుంది. దాంతో, ముగ్గురి పేర్లతో గవర్నర్ కు ప్రతిపాదనలు పంపించింది ఏపీ సర్కార్. ముగ్గురిలో సాహ్ని పేరునే గవర్నర్ బీబీ హరిచందన్ ఖరారు చేశారు. ఏప్రిల్ ఒకటో తేదీన కొత్త ఎన్నికల కమిషనర్ నీలం సాహ్ని బాధ్యతలు స్వీకరిస్తారు.

Tags:    

Similar News