మంత్రి పదవి రాకపోవడంపై ధర్మశ్రీ కంటతడి

Karanam Dharmasri: పార్టీ అభివృద్ధికి ఎంతో కష్టపడి పనిచేశా

Update: 2022-04-11 09:45 GMT

మంత్రి పదవి రాకపోవడంపై ధర్మశ్రీ కంటతడి

Karanam Dharmasri: మంత్రివర్గ విస్తరణలో తనకు పదవి దక్కకపోవడంపై చోడవరం శాసనసభ్యులు కరణం ధర్మశ్రీ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పార్టీ పెట్టిన నాటి నుంచి పార్టీ అభివృద్ధి కోసం ఎంతో కష్టపడిన తనకు మంత్రి పదవి రాకపోవడంపై ధర్మశ్రీ కంటతడిపెట్టారు. రెండోసారి మంత్రివర్గంలో చోటు ఉంటుందని విజయసాయిరెడ్డి హామీ ఇచ్చారని ధర్మశ్రీ చెప్పారు. అయినా మంత్రివర్గంలో చోటు దక్కకపోవడం ఆవేదన కలిగించిందన్నారు. మంత్రి పదవికి తాను అర్హుడుని కాదా అంటూ ప్రశ్నించారు. త్వరలోనే ము‌ఖ్యమంత్రిని కలుస్తానని తెలిపారు ఎమ్మెల్యే ధర్మశ్రీ.

Tags:    

Similar News