AP News: టీడీపీలో చేరిన కోటంరెడ్డి గిరిధర్రెడ్డి
AP News: ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది.
AP News: టీడీపీలో చేరిన కోటంరెడ్డి గిరిధర్రెడ్డి
AP News: ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సోదరుడు, వైసీపీ నేత గిరిధర్ రెడ్డి టీడీపీలో చేరారు. పార్టీ అధినేత చంద్రబాబు సమక్షంలో ఆయన టీడీపీ తీర్థం పుచుకున్నారు. కోటంరెడ్డి గిరిధర్ రెడ్డికి పసుపు కండువా కప్పిన చంద్రబాబు పార్టీలోకి సాదరంగా స్వాగతం పలికారు. గిరిధర్ రెడ్డితో పాటు ఆయన అనుచరులు కూడా పెద్ద సంఖ్యలో టీడీపీలోకి వచ్చారు. 2023లో 23వ తేదీన 23 ఓట్లతో టీడీపీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలవడం దేవుడి అసలైన స్క్రిప్ట్ అని అభివర్ణించారు. దేవుడు స్క్రిప్ట్ తిరగ రాశాడని పేర్కొన్నారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ రాష్ట్రమంతా గెలుస్తుందన్న చంద్రబాబు.. గిరిధర్ రెడ్డిలాంటి వారు పార్టీలోకి రావడంవల్ల పార్టీ బలం ఇంకా పెరుగుతుందన్నారు. జగన్మోహన్ రెడ్డి పని అయిపోయిందని.. గిరిధర్ రెడ్డి లాంటి సేవాభావం ఉన్నవారే జగన్ పార్టీలో ఉండలేకపోతే, సామాన్యకార్యకర్తలు ఎలా ఉంటారని చంద్రబాబు ప్రశ్నించారు.