గుంటూరు నగర శివారులోని గోరంట్ల ఇన్నర్ రింగ్ రోడ్డులో ఏర్పాటు చేసిన జనసేన పార్టీ కార్యాలయాన్ని తరలిస్తున్నారు. ఈ భవనాన్ని ఖాళీ చేసి యజమానికి తిరిగి అప్పగించినట్టు తెలుస్తోంది. బిల్డింగ్ ముందు టూలెట్ బ్యానర్ పెట్టారు. ఆఫీస్ లేదా బార్ అండ్ రెస్టారెంట్కు అద్దెకు ఇస్తానని అందులో పేర్కొన్నారు యజమాని. కాగా 2019 మార్చి నెలలో ఈ కార్యాలయాన్ని జనసేన అగ్రనేతలు ప్రారంభించారు. ఎన్నికల ముందే టీడీపీ నుంచి జనసేనలో చేరిన రావెల కిషోర్బాబు మళ్ళీ ఇటీవల బీజేపీలో చేరారు. దీంతో ఆయన అధీనంలో నడుస్తున్న ఈ కార్యాలయాన్ని కూడా ఖాళీ చేయించినట్టు తెలుస్తోంది.